ప్రధాని సభలో సీఎం కేసీఆర్ కు కుర్చీ!
- పరేడ్ గ్రౌండ్స్ సభావేదికపై ముఖ్యమంత్రికి సీటు రిజర్వ్
- కేసీఆర్ హాజరుకావట్లేదని తెలిసినా ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు
- కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి సహా మరో పదిమంది నేతలకు సీట్లు
సీఎం కేసీఆర్ తో పాటు మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా కుర్చీ వేశారు. తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి తదితరుల కోసం మొత్తం పది సీట్లను రిజర్వ్ చేశారు. ప్రోటోకాల్ ప్రకారమే ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ రాకకు ముందే సభావేదికపై సీట్లు కేటాయించిన వారంతా హాజరుకావాలి. రిజర్వ్ చేసిన సీట్లకు సంబంధించిన నేతల్లో ఎవరైనా రాకపోతే వెంటనే ఆ సీటును అధికారులు తొలగిస్తారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు నిర్ణయం తీసుకుంటారు.