Margadarsi: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

  • మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ విచారణ
  • 30 మంది మేనేజర్లకు నోటీసులు
  • నిన్న రామోజీరావును ప్రశ్నించిన సీఐడీ అధికారులు
  • తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు
Telangna high court orders AP CID in Margadarsi case

మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరుగుతున్నాయంటూ విచారణ జరుపుతున్న ఏపీ సీఐడీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శికి చెందిన 30 మంది మేనేజర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది. 

ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ ఇప్పటికే 30 మంది మేనేజర్లకు నోటీసులు ఇచ్చింది. నిన్న రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును కూడా సీఐడీ అధికారులు విచారించారు. 

ఈ నేపథ్యంలో, సీఐడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రామోజీరావు ఆరోగ్య పరిస్థితిని, ఆయనను విచారించిన తీరును పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, సీఐడీ కస్టడీలో ఉన్న మార్గదర్శి ఆడిటర్ కు గాయాలయ్యాయని తెలిపారు.

More Telugu News