Saitej: అమ్మకిచ్చిన మాట ఈ సినిమాతో నిలబడుతుంది: 'విరూపాక్ష' ఈవెంట్లో సాయితేజ్!

  • సాయితేజ్ హీరోగా చేసిన 'విరూపాక్ష'
  • దర్శకుడిగా కార్తీక్ వర్మ దండు 
  • ఈ సినిమా హైలైట్స్ గురించి ప్రస్తావించిన సాయితేజ్ 
  • ఈ నెల 21వ తేదీన విడుదల కానున్న సినిమా  

Virupaksha Characters Introduction Event

సాయితేజ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన 'విరూపాక్ష' సినిమాకి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమాలోని ప్రధానమైన పాత్రలను పరిచయం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ వేదికపై సాయితేజ్ మాట్లాడుతూ .. "2018లో సుకుమార్ గారు నా దగ్గరికి ఓక కథను పంపిస్తున్నట్టుగా చెప్పారు. లవ్ స్టోరీ అయ్యుంటుందని అనుకున్నాను. థ్రిల్లర్ అని తెలిసి షాక్ అయ్యాను. కార్తీక్ వర్మ దండు కథని వినిపించిన తరువాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని నాకు అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను" అని అన్నాడు. 

కార్తీక్ వర్మ దండు తన తల్లికి చేసిన ప్రామిస్ .. నేను మా అమ్మకి చేసిన ప్రామిస్ ఈ సినిమాతో జరగబోతోంది. స్పెషల్ సెట్స్ .. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. టీజర్ కీ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో  ఈ సినిమాపై మరింతగా నమ్మకం ఏర్పడింది. ఈ పాత్రను నేను ఇంత బాగా చేయడానికి ప్రతి ఒక్కరూ నాకు సపోర్టు చేస్తూ వచ్చారు" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News