వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడడానికి నువ్వెవరు అంటున్నారు: కేటీఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడడానికి నువ్వెవరు అంటున్నారు: కేటీఆర్

KTR says questions arise after he wrote letter on Vizag Steel Plant
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్
  • ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ లేఖ
  • కొందరు తనను ప్రశ్నిస్తున్నారన్న కేటీఆర్
ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే. అయితే, ఈ విషయంలో కొందరు తనను ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకంపై నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటున్నారని తెలిపారు. ఇప్పుడే కాదు, 2021 నుంచి తాను ఈ అంశంపై అనేక పర్యాయాలు మాట్లాడుతూనే ఉన్నానని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతిస్తూనే ఉన్నానని కేటీఆర్ వివరించారు. మరీ ముఖ్యంగా, ఇప్పుడు గనుక మనం ఈ అంశంపై మాట్లాడకపోతే, మోదీ సర్కారు తదుపరి సింగరేణి కాలరీస్ ను ప్రైవేటు పరం చేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

ఈ క్రమంలో ఇతరుల సమస్యలపై నువ్వు మాట్లాడకపోతే, చివరికి నీ సమస్యపై మాట్లాడడానికి ఎవరూ మిగలరన్న మార్టిన్ నీమోలర్ పాప్యులర్ సూక్తిని కూడా కేటీఆర్ పంచుకున్నారు.
Advertisement
KTR
Vizag Steel Plant
Letter
BRS
Telangana
Andhra Pradesh

More Telugu News