గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు
- శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహించిన రాజా సింగ్
- యాత్రలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఎస్ఐ ఫిర్యాదు
- పీడీ యాక్ట్ తిరిగి తెరిచి, జైలుకు పంపేందుకే కేసు పెట్టారని రాజా సింగ్ విమర్శ
అయితే, ఈ కేసును రాజాసింగ్ తప్పుబట్టారు. శోభాయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. ధర్మం గురించి, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా లేదా పాకిస్థాన్లో ఉందా అని రాజాసింగ్ ప్రశ్నించారు. తనపై కొట్టేసిన పీడీ యాక్ట్ తిరిగి తెరిచి తనను మళ్లీ జైలుకు పంపే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.