తొలి తరం దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
- అనారోగ్యంతో కన్నుమూసిన సలీమ్ దురానీ
- కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న మాజీ ఆల్ రౌండర్
- భారత్ తరఫున 29 టెస్టులు ఆడిన సలీమ్
దురానీ 1934, డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్లోని కాబూల్ లో జన్మించారు. తన 8 నెలల వయసులో ఆయన కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. 1947లో భారత్-పాక్ విభజన అనంతరం దురానీ కుటుంబం భారత్కు వచ్చేసింది. 1960లో ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్తో భారత్ తరఫున అరంగేట్రం చేశారు. 1960-70 దశకంలో భారత జట్టులో నాణ్యమైన ఆల్రౌండర్గా గుర్తింపుపొందారు. 1973లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దురానీ తర్వాత బాలీవుడ్లో అడుగు పెట్టారు.. నటుడు ప్రవీన్ బాబీతో కలిసి ‘చరిత్ర’ సినిమాలో పనిచేశారు. అర్జున అవార్డును అందుకున్న తొలి క్రికెటర్ సలీమ్ దురానీ (1960)నే కావడం విశేషం. దురానీ మృతిపట్ల మాజీ క్రికెటర్, మాజీ కోచ్ రవిశాస్త్రి, వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం ప్రకటించారు.