Vikram: 'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్!

  • భారీ చారిత్రక చిత్రంగా నిలిచిన 'పొన్నియిన్ సెల్వన్'
  • ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సీక్వెల్ విడుదల
  • చెన్నైలో ఈ నెల 29న జరగనున్న ఆడియో లాంచ్ ఈవెంట్
  • వేదికగా మారిన నెహ్రూ ఇండోర్ స్టేడియం
Ponniyin Selven 2 Update

తమిళంలో చారిత్రక నేపథ్యంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలలో 'పొన్నియిన్ సెల్వన్' ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించడమే కాదు .. లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి ఈ సినిమాను నిర్మించారు. చోళ - పాండ్యరాజుల మధ్య సాగే ప్రతీకార వ్యూహాలే ఈ సినిమా. 

క్రితం ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, తన భారీతనాన్ని చాటుకుంది. వసూళ్ల విషయంలో తమిళనాట కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అలాంటి సినిమాకి సీక్వెల్ గా రూపొందిన  'పొన్నియిన్ సెల్వన్ 2' ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ .. ట్రైలర్ లాంచ్ ఈవెంటును ఈ నెల 29వ తేదీన చెన్నైలో నిర్వహించనున్నారు. అక్కడి నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇందుకు వేదికగా మారనుంది. గ్రాండ్ గా జరగనున్న ఈవెంటుకి కమల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.

More Telugu News