పేపర్ లీకేజ్ కేసు విచారణ రేపటికి వాయిదా
- వాదనలు వినిపించనున్న వివేక్ ధన్కా
- హైకోర్టులో నిరుద్యోగుల పిటిషన్
- నిందితుల సిట్ విచారణ పూర్తి.. కీలక సమాచారం వెల్లడి
తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ ఆదివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు హిమాయత్నగర్ కార్యాలయంలో జరిగిన విచారణలో సిట్ అధికారులు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఐపీ అడ్రస్ లు మార్చేసి, కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్స్ దొంగిలించినట్లు నిందితుడు రాజశేఖర్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.