హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం
- రాజేంద్రనగర్ లో ప్లాస్టిక్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు
- పది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
- ప్లాస్టిక్ కాలిన పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు
పాఠశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష సెంటర్ ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కానీ, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల గోదాంలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.