She suttle: హైదరాబాద్ లో షీ షటిల్ బస్సు.. మహిళలకు ఉచిత ప్రయాణం

  • బస్సును ప్రారంభించిన డీజీపీ అంజనీ కుమార్
  • రాయదుర్గంలో గ్రాండ్ గా ఉమెన్స్ కాంక్లేవ్ అవార్డుల కార్యక్రమం
  • డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారుల హాజరు
Dgp started free She Shuttle services in hyderabad

హైదరాబాద్ సిటీలో మహిళల భద్రత కోసం రెండు షీ షటిల్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. శుక్రవారం రాయదుర్గం జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డుల కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బస్సును తయారుచేశారని తెలిపారు. మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు ఏర్పాటు చేశారని వివరించారు. భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు కూడా ఉంటారని నిర్వాహకులు తెలిపారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ ముఖ్య అతిధి కాగా, సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఎస్ సీ ఎస్ సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Telugu News