Bhagwant Singh Mann: మా తొలి బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యత దీనికే: పంజాబ్ సీఎం భగవంత్ మాన్

  • పంజాబ్ లో ఆప్ ప్రవేశ పెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్
  • ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేశామన్న భగవంత్ మాన్
  • పంజాబ్ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక దినమని వ్యాఖ్య
We gave top priority for peoples interest in budget says Punjab CM Bhagwant Singh Mann

పంజాబ్ అసెంబ్లీలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. రాష్ట్ర ఆర్షిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు పెద్ద పీట వేయడానికే బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు. గత ఏడాది ఈరోజు ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలుపొందామని... ఏడాది తర్వాత ఈ రోజున తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. పంజాబ్ చరిత్రలో ఇదొక చారిత్రాత్మక దినమని చెప్పారు. తమ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల జీవితాలను మార్చే విధంగా ఉంటుందని తెలిపారు. 

More Telugu News