MLC Elections: ఏపీలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

  • ఈ నెల 29కి ఖాళీ అవుతున్న మండలి స్థానాలు
  • నేటి నుంచి నామినేషన్లు
  • ఈ నెల 23న పోలింగ్
  • అదే రోజున ఓట్ల లెక్కింపు
MLA quota MLC elections notification released

ఏపీ శాసనమండలిలో ఈ నెలాఖరుకు ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్సీలు నారా లోకేశ్, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, గంగుల ప్రభాకర్ రెడ్డి, పెన్మత్స సూర్యనారాయణరాజు, చల్లా భగీరథరెడ్డి, పోతుల సునీతల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. 

వీరిలో చల్లా భగీరథరెడ్డి గతేడాది నవంబరులో కన్నుమూయగా, బచ్చుల అర్జునుడు కొన్నిరోజుల కిందటే మృతి చెందారు. ఈ నేపథ్యంలో, మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల చేశారు.

  • ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. సెలవు దినాలు మినహా మిగతా పని దినాల్లో నామినేషన్ల స్వీకరణ
  • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్న అధికారులు.
  • అభ్యర్థి స్వయంగా గానీ, తన ప్రతిపాదకుడి ద్వారా గానీ నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం.
  • వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో నామినేషన్ల దాఖలు. రిటర్నింగ్ అధికారి/ సహాయ రిటర్నింగ్ అధికారి/ శాసనమండలి ఉప కార్యదర్శికి నామినేషన్లు సమర్పించే అవకాశం.
  • ఈ నెల 14న ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన.
  • ఈ నెల 16 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
  • ఈ నెల 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీ భవనంలో పోలింగ్. పోటీ ఉంటేనే ఎన్నికలు... లేకపోతే ఏకగ్రీవం అయినట్టు ప్రకటన.
  • అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.

More Telugu News