Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 899 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 272 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా లాభపడ్డ ఎస్బీఐ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకోవడమే కాకుండా... ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 899 పాయింట్లు పెరిగి 59,809కి చేరుకుంది. నిఫ్టీ 272 పాయింట్లు లాభపడి 17,594 వద్ద స్థిరపడింది. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకింగ్ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.11%), భారతి ఎయిర్ టెల్ (3.30%), రిలయన్స్ (2.46%), ఐటీసీ (2.42%), టాటా స్టీల్ (2.20%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-2.19%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.04%), నెస్లే ఇండియా (-0.17%), ఏసియన్ పెయింట్స్ (-0.17%).

More Telugu News