Nagineedu: నా ఒరిజినల్ క్యారెక్టర్ నే రాజమౌళి నాకు ఇచ్చారు: నటుడు నాగినీడు

  • క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాగినీడు బిజీ 
  • 'మర్యాద రామన్న'తో మంచి గుర్తింపు 
  • తన ప్రతిభను రాజమౌళి బయటికి తీశారని వ్యాఖ్య 
  • వేషాలు రావనే భయం లేదని వెల్లడి  

Nagineedu Interview

నాగినీడు అనే పేరు వినగానే అందరి కళ్లముందు కదలాడేది 'మర్యాద రామన్న' సినిమాలో ఆయన పోషించిన రామినీడు పాత్ర. 'మీరు ఇంత మర్యాద ఇస్తే నేను ఎంతో మర్యాదనిస్తా .. తేడా వస్తే' అంటూ ఆ సినిమాలో రాయలసీమ యాసలో ఆయన చెప్పిన డైలాగ్ అందరికీ బాగా గుర్తు.


తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో నాగినీడు మాట్లాడుతూ .. "తమిళంలో నేను చేసిన 'పళ్లి కూడుమ్' సినిమాను రాజమౌళి చూశారాట. ఆ సినిమాలో నేను పోషించిన పాత్ర .. నా నటన ఆయనకి బాగా నచ్చాయి. అందువల్లనే ఆయన నన్ను పిలిపించి 'మర్యాద రామన్న' సినిమాలో 'రామినీడు' పాత్రను ఇచ్చారు. 

ఈ సినిమాలో నేను చాలా బాగా చేశానని అంతా అంటున్నారు. నిజానికి నా ఒరిజినల్ క్యారెక్టర్ అదే .. మాది రాయలసీమనే. ఇంత మర్యాద ఇస్తే .. ఇంత మర్యాదనిస్తాను .. తేడా వస్తే కూడా అలాగే ఉంటుంది. ఆ ఒరిజినాలిటీని రాజమౌళి గారు బయటికి తీశారు. ఏ విషయంలోనైనా నేను ముక్కుసూటిగానే ఉంటాను. నాకు వేషాలు ఇవ్వరేమో .. రావేమో అనే భయం నాకు ఎప్పుడూ లేదు" అని చెప్పారు.

More Telugu News