Sensex: 141 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

  • లాభాల్లో ప్రారంభమై క్రమంగా నష్టాల్లోకి మార్కెట్లు  
  • 45 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా పతనమైన ఎం అండ్ ఎం షేర్ విలువ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. ఈరోజు కూడా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 141 పాయింట్లు కోల్పోయి 59,463కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు పతనమై 17,465 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (1.24%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.92%), ఎన్టీపీసీ (0.83%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.82%), రిలయన్స్ (0.77%).     

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.39%), టాటా స్టీల్ (-1.88%), టాటా మోటార్స్ (-1.27%), మారుతి (-1.22%), ఎల్ అండ్ టీ (-1.10%).

More Telugu News