Vasantha Krishna Prasad: మారని టీడీపీ సానుభూతిపరులైన వాలంటీర్లను తొలగిస్తాం: వసంత కృష్ణప్రసాద్

  • టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లుగా అవకాశం కల్పించామన్న కృష్ణప్రసాద్
  • వాళ్లు మారతారులే అనుకున్నామని వ్యాఖ్య
  • కొందరు వాలంటీర్లు మారలేదన్న వైసీపీ ఎమ్మెల్యే
Will terminate TDP supporting volunteers says Vasantha Krishna Prasad

మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థలో టీడీపీ సానుభూతిపరులకు కూడా వాలంటీర్లుగా అవకాశం కల్పించామని... వాళ్లే మారుతారులే, వాళ్లు వైసీపీకి అనుకూలంగా తయారవుతారులే అని వేచి చూశామని చెప్పారు. టీడీపీ సానుభూతిపరులైన వాలంటీర్లలో కొందరు మారారని, మరికొందరు మారలేదని అన్నారు. మారనటువంటి వాలంటీర్లను స్థానిక నేతలు గుర్తించి చెపితే వారిని తక్షణమే తొలగిస్తామని చెప్పారు. 

ఈ వ్యవస్థ పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. అలాగని చెప్పి అకారణంగా ప్రతి వాలంటీర్ ను మారుస్తామంటే కుదరదని, మార్చే ప్రతి వాలంటీర్ తో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని తెలిపారు. గృహ సారథులు, వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కృష్ణప్రసాద్ వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వ జీతంతో పనిచేసే వాలంటీర్లను వైసీపీ కార్యకర్తల మాదిరి చూస్తున్నారని మండిపడుతున్నారు.

More Telugu News