మంచుపై స్కీయింగ్ చేస్తున్న రాహుల్ గాంధీ.. వీడియో ఇదిగో!
- గుల్మార్గ్ లో సేదతీరుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్
- రెండు రోజుల వ్యక్తిగత పర్యటన కోసం వచ్చారన్న పార్టీ నేతలు
- ఇటీవలే 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తిచేసిన కాంగ్రెస్ మాజీ చీఫ్
ఇటీవలే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రాహుల్ మొత్తం 12 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం మీదుగా సుమారు 4 వేల కిలోమీటర్లు నడిచారు. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఈ పర్సనల్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రిసార్టులో స్కీయింగ్ ప్రారంభించడానికి ముందు స్థానికులతో కలిసి రాహుల్ సెల్ఫీలకు పోజిచ్చారు. రాహుల్ గాంధీ స్కీయింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.