Assembly: ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  • నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ
  • సభకు సమాధానం ఇచ్చిన సీఎం కేసీఆర్
  • ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం
  • అనంతరం సభ నిరవధిక వాయిదా
Telangana assembly budget sessions ended

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. నేడు ద్రవ్య వినియమ బిల్లుపై సభలో చర్చ చేపట్టారు. సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.  

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7 రోజుల పాటు సాగాయి. మొత్తం 56 గంటల 25 నిమిషాల సేపు అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగాయి. టీఆర్ఎస్ పార్టీ ఇటీవలే బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందడం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే.

More Telugu News