విపక్షాల ఆందోళన నేపథ్యంలో.. ఉభయ సభలు సోమవారానికి వాయిదా
- కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాలు
- ఇటీవల అదానీపై హిండన్ బర్గ్ నివేదిక
- లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన విపక్ష సభ్యులు
- డౌన్ డౌన్ అంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు
- జేపీసీ లేదా సీజేఐ పర్యవేక్షణలో దర్యాప్తునకు డిమాండ్
విపక్ష నేతల తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం అని వ్యాఖ్యానించారు. స్పీకర్ నిర్ణయం నేపథ్యంలో, ఇవాళ ఎలాంటి చర్చ జరగకుండానే సభ వాయిదా పడింది.
అటు, రాజ్యసభలో ఇదే పరిస్థితి కనిపించింది. విపక్షాల తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ తోసిపుచ్చారు. దాంతో సభలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేయగా, ఆ తర్వాత కూడా విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.