ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన కేసీఆర్
- మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు నివాళి
- పరేడ్ గ్రౌండ్ లో అమర జవానులకు నివాళి
- కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్, డీజీపీ, పలువురు మంత్రులు
ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు కేసీఆర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. దీనికి ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్తూపం వద్ద ఆయన నివాళి అర్పించారు. మరోవైపు రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాలేదు.
