Tirumala: భక్తులు అత్యధికంగా సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండోస్థానం

  • మొదటి స్థానంలో వారణాసి
  • కరోనా ఆంక్షల సడలింపుతో తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
  • గదుల బుకింగ్‌లో తిరుపతి ఫస్ట్
tirumala in second place in devotees visiting

ఈ ఏడాది భక్తులు అత్యధికంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల రెండో స్థానంలో నిలిచింది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈసారి ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది. ఈ మేరకు ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై నిర్వహించిన సర్వే అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ఆలయాల్లో వారణాసి మొదటి స్థానంలో నిలవగా, తిరుమల ఆ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే, తిరుపతిలో పర్యాటకుల గదుల బుకింగ్ గతేడాదితో పోలిస్తే 233 శాతం పెరిగినట్టు ఓయో రిపోర్టు పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, షిరిడీ ఉన్నాయి.

More Telugu News