Manipur: మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 15 మంది బాలికల దుర్మరణం

  • మణిపూర్ లో విషాదం
  • నోనీ జిల్లా లాంగ్ సాయ్ వద్ద దుర్ఘటన
  • బోల్తా పడిన విద్యార్థుల బస్సు
  • విజ్ఞాన యాత్రకు వెళుతున్న విద్యార్థులు
Fatal road mishap in Manipur

మణిపూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నోనీ జిల్లా లాంగ్ సాయ్ వద్ద ఓ విద్యాసంస్థకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ  ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది బాలికలు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. విద్యార్థులు విజ్ఞాన యాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

ఈ విద్యార్థులంతా యారిపోక్ లోని తంబాల్ను హయ్యర్ సెకండరీ స్కూలుకు చెందినవారు. ఎడ్యుకేషనల్ టూర్ నిమిత్తం రెండు బస్సుల్లో ఖౌపుమ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

More Telugu News