YS Sharmila: పాలేరులో వైఎస్సార్టీపీ కార్యాలయానికి భూమి పూజ చేసిన షర్మిల.. వీడియో ఇదిగో!

  • వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయనున్న షర్మిల
  • హైదరాబాద్ వెలుపల పార్టీ తొలి కార్యాలయం
  • సంక్రాంతి తర్వాత పాదయాత్రను కొనసాగించనున్న షర్మిల
YS Sharmila lays foundation stone for party office in Palair

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. వైఎస్సార్టీపీకి కేవలం హైదరాబాద్ లో మాత్రమే కార్యాలయం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ వెలుపల పాలేరులో కూడా ఆఫీస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. 

వచ్చే ఏడాది తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాలేరులో పార్టీ ఆఫీస్ ను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు, షర్మిల పాదయాత్ర చేసుకోవడానికి హైకోర్టు అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, సంక్రాంతి తర్వాత పాదయాత్రను మళ్లీ కొనసాగించనున్నట్టు ఆమె ప్రకటించారు.

More Telugu News