బంగ్లాదేశ్ టాపార్డర్ ను కకావికలం చేసిన సిరాజ్
- ఛట్టోగ్రామ్ లో భారత్, బంగ్లాదేశ్ తొలిటెస్టు
- నేడు ఆటకు రెండో రోజు
- తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 ఆలౌట్
- మొదటి ఇన్నింగ్స్ షురూ చేసిన బంగ్లా
- 56 పరుగులకే 4 వికెట్లు డౌన్
- సిరాజ్ కు 3 వికెట్లు
టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ను సిరాజ్ హడలెత్తించాడు. బంగ్లా ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో (0), జకీర్ హుస్సేన్ (20), కెప్టెన్ లిట్టన్ దాస్ (24) వికెట్లను పడగొట్టి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. మరో ఎండ్ లో ఉమేశ్ ఓ వికెట్ తీయడంతో ఆతిథ్య జట్టు 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ప్రస్తుతం బంగ్లా జట్టు 23 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ 15 పరుగులతోనూ, కెప్టెన్ షకీబల్ హసన్ 2 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు బంగ్లాదేశ్ ఇంకా 333 పరుగులు వెనుకబడి ఉంది.