రంగారెడ్డి జిల్లాలో కిడ్నాపైన యువతిని కాపాడిన పోలీసులు
- గతంలో ప్రేమించుకున్న నవీన్ రెడ్డి, వైశాలి!
- ఇటీవల వైశాలికి నిశ్చితార్థం
- వైశాలి ఇంటిపై దాడి చేసిన కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి
- నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైశాలి, నవీన్ గతంలో ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లికి వైశాలి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో నవీన్ రెడ్డి సివిల్ కోర్టు ద్వారా వారికి నోటీసులు పంపాడు. తాను, వైశాలి సహజీవనం చేశామని తెలిపాడు.
ఇటీవల వైశాలికి నిశ్చితార్థం జరగడంతో భరించలేకపోయిన నవీన్ రెడ్డి... వైశాలి నివాసంపై దాడికి దిగాడు. వైశాలిని బలవంతంగా తనతో తీసుకెళ్లాడు. దాంతో ఆగ్రహించిన వైశాలి కుటుంబ సభ్యులు నవీన్ రెడ్డికి చెందిన మిస్టర్ టీ రెస్టారెంట్ ను అగ్నికి ఆహుతి చేశారు.