చైనాలోని అతిపెద్ద పిగ్ సెంటర్ పై నిపుణుల ఆందోళన
- హూబే ప్రావిన్స్ లో 6,50,000 పందులను పెంచే కేంద్రం
- ఏడాదికి 10 లక్షల పందులను వధించే ఏర్పాట్లు
- జంతు వ్యాధులు ప్రబలుతాయంటున్న నిపుణులు
కానీ, చైనా చేసిన ఈ పనిపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. జంతు వ్యాధులు ప్రబలిపోతాయన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వెలువడే వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఒక స్విచ్ నొక్కితే ఒకేసారి 30,000 పందులకు ఆహారం అందుతుంది. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తయ్యే పంది మాంసంలో సగం చైనానే వినియోగిస్తుంటుంది. ప్రమాదకరమైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణంగా చైనాలో 2018 నుంచి 2020 మధ్య 10కోట్ల పందులు చనిపోయాయి. దీంతో పందుల ఉత్పత్తి పెంచాలన్న లక్ష్యంతో చైనా సర్కారు ఈ అతిపెద్ద పందుల కేంద్రాన్ని నిర్మించింది.