Andhra Pradesh: బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అనంతబాబు... విచారణ వచ్చే నెల 12కు వాయిదా

  • డ్రైవర్ హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంతబాబు
  • బెయిల్ పిటిషన్లను కొట్టేసిన రాజమహేంద్రవరం కోర్టు, ఏపీ హైకోర్టు
  • అనంతబాబు బెయిల్ పిటిషన్ పై వచ్చే నెల 12న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ
  • తమ వాదనలూ పరిగణనలోకి తీసుకోవాలన్న సుబ్రహ్మణ్యం తండ్రి 
supreme court adjourns mlc anantha babu bail petition

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ సోమవారం విచారణకు రాగా... అనంతబాబు బెయిల్ పిటిషన్ పై కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ పిటిషన్ పై తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అనంతబాబుకు బెయిల్ ను రాజమహేంద్రవరం కోర్టుతో పాటు ఏపీ హైకోర్టు ఇదివరకే తిరస్కరించిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే అదే సమయంలో ఈ పిటిషన్ విచారణలో భాగంగా తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తండ్రి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు... రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది.

More Telugu News