బిల్లు విషయమై రాజ్ భవన్ కు వచ్చి చర్చించమంటూ... తెలంగాణ సర్కారుకు లేఖ రాసిన గవర్నర్ తమిళిసై

ts governor tamilisai writes a lettes to state government to clarify her doubts on new bills
  • విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ
  • గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ లో ఉండిపోయిన బిల్లు
  • గవర్నర్ ఆమోదం తెలిపితేనే వర్సిటీలో ఖాళీల భర్తీకి అవకాశం
  • విద్యా శాఖ మంత్రితో పాటు యూజీసీకి లేఖ రాసిన తమిళిసై
తెలంగాణ సర్కారు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం లేఖ రాశారు.  

ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ సర్కారు 7 అంశాలకు సంబంధించిన బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. వాటిలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించిన విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు కూడా ఉంది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపితే... రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.  

ఈ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుకు ఆమోదం తెలిపే విషయంపై తమిళిసై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి లేఖ రాశారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే భవిష్యత్తులో ఏమైనా అవరోధాలు ఎదురవుతాయా? అన్న విషయమై మీరు స్వయంగా రాజ్ భవన్ కు వచ్చి చర్చించాలని మంత్రికి గవర్నర్ లేఖ రాశారు. అదే సమయంలో ఈ బిల్లుకు ఆమోదంతో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? అన్న విషయంపై వివరణ ఇవ్వాలని తమిళిసై యూజీసీకి కూడా లేఖ రాశారు.
Go Back to Shorts
Telangana
TRS
Sabitha Indra Reddy
Raj Bhavan
Tamilisai Soundararajan
UGC

More Telugu News