Telangana: కేసీఆర్ తో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లే: బీజేపీని హెచ్చరించిన బాల్క సుమన్

trs mla balka suman fires on operation akarsh gang
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేలా మంతనాలు సాగిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ముఠా వ్యవహారంపై ఆ పార్టీ యువ నేత, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌజ్ పై సైబరాబాద్ పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన వ్యవహారంపై బుధవారం రాత్రి సుమన్ స్పందించారు.

సీఎం కేసీఆర్ తో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టేనని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మునుగోడు ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ నేతలు దొడ్డి దారి పట్టారని ఆయన ఆక్షేపించారు.

అంగట్లో సరుకులా రాజగోపాల్ రెడ్డి లాంటి వారిని బీజేపీ నేతలు కొనొచ్చేమో గానీ... టీఆర్ఎస్ నేతలను కొనలేరని సుమన్ అన్నారు. టీఆర్ఎస్ నేతలే కేంద్రం కుట్రలను బయటపెట్టారని ఆయన అన్నారు. రూ.100 కోట్లకు పైగా డబ్బుతో పాటు కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 

దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలతో చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆగం చేయాలని యత్నించిన బీజేపీ నేతలే ఆగమయ్యారని సుమన్ అన్నారు. చండూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
Go Back to Shorts
Telangana
TRS
Balka Suman
Cyberabad Police
BJP

More Telugu News