Rajinikanth: చాలా ఏళ్ల తర్వాత అతిథి పాత్రలో నటిస్తున్న రజనీకాంత్

  • అధర్వ మురళి హీరోగా సినిమాను తెరకెక్కించనున్న రజనీ కూతురు
  • తన తండ్రి కోసం స్క్రిప్టును సిద్ధం చేసిన ఐశ్వర్య
  • 2011లో చివరి సారిగా అతిథి పాత్రను పోషించిన రజనీ
Rajinikanth to act in guest role after a decade

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఓ చిత్రంలో అతిథి పాత్రను పోషించబోతున్నారు. 2011లో వచ్చిన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ చిత్రం 'రా వన్' చిత్రంలో ఆయన చివరి సారిగా అతిథి పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఆయన చిట్టి రోబోగా కనిపించారు. తాజాగా, మరో చిత్రంలో గెస్ట్ రోల్ పోషించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకురాలిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అధర్వ మురళి ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధమయింది. తన తండ్రి అతిథి పాత్రలో నటించేలా ఐశ్వర్య స్క్రిప్టును రెడీ చేశారు. గెస్ట్ రోల్ లో నటించాలన్న తన కూతురు కోరికకు రజనీ ఓకే చెప్పారు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

More Telugu News