Rahul Gandhi: మీరు ఏ సన్ స్క్రీన్ వాడతారంటూ అడిగిన కార్యకర్తలు... రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే...!

  • కర్ణాటకలో భారత్ జోడో యాత్ర
  • కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ
  • సాయంత్రం వేళ శిబిరంలో కార్యకర్తలతో ముచ్చట
Congress workers asks Rahul Gandh which sunscreen he uses

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్ జోడో యాత్ర కొనసాగించగా, దానికి సంబంధించిన ఓ వీడియోను పార్టీ సోషల్ మీడియా విభాగం నేడు విడుదల చేసింది. పార్టీ కార్యకర్తలతో రాహుల్ గాంధీ ముచ్చటించడం ఈ వీడియోలో చూడొచ్చు. పాదయాత్ర ముగిసిన తర్వాత సాయంత్రం వేళ తమకు ఏర్పాటు చేసిన శిబిరంలో రాహుల్ పార్టీ కార్యకర్తల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆ వివరాలు ఇవిగో...

రాహుల్ గాంధీ: అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
కార్యకర్తలు: 100 శాతం ఆరోగ్యంగా ఉన్నాం సర్.
ఓ కార్యకర్త: చాలా దూరం నడుస్తుంటాం కాబట్టి బొబ్బలు వంటి సమస్యలు ఉంటాయి.
రాహుల్ గాంధీ: మీలో ఎవరికైనా బొబ్బలు వచ్చాయా?
ఓ మహిళా కార్యకర్త: నాకెలాంటి బొబ్బలు రాలేదు.
రాహుల్ గాంధీ: నాక్కూడా రాలేదు.
ఓ కార్యకర్త: మీరు ఏ సన్ స్క్రీన్ క్రీమ్ వాడతారు?
రాహుల్ గాంధీ: నేను ఏ సన్ స్క్రీన్ వాడను. మా అమ్మ (సోనియా గాంధీ) ఓ సన్ స్క్రీన్ క్రీమ్ పంపింది కానీ, నేను దాన్ని వాడడంలేదు.

More Telugu News