Roja: పవన్ కల్యాణ్ ను తరిమికొట్టండి: 'విశాఖ గర్జన'లో రోజా

  • మూడు రాజధానులకు అనుకూలంగా విశాఖ గర్జన
  • మూడు ప్రాంతాల అభివృద్ధే జగన్ సంకల్పమన్న రోజా
  • చంద్రబాబు చేసేది రియలెస్టేట్ పోరాటమని విమర్శ
Pawan Kalyan supporting paid artists says Roja

మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన విజయవంతమయింది. ఈ సభలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ... అమరావతి పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేసేది రియలెస్టేట్ పోరాటమని అన్నారు. చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలని చెప్పారు. తాము మూడు ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నామని... తాము చేస్తున్నది ప్రజా పోరాటమని అన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే జగనన్న సంకల్పమని చెప్పారు. జగన్ సంకల్పానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించాలని అన్నారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా రోజా విమర్శలు గుప్పించారు. షూటింగులకు, కలెక్షన్ల కోసం, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం పవన్ కు విశాఖ కావాలని... కానీ విశాఖ రాజధానిగా మాత్రం వద్దని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టుకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్ కు చూపించాలని... ఆయనను తరిమికొట్టాలని అన్నారు.

More Telugu News