AP CID: సీఐడీ కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో చింత‌కాయ‌ల విజ‌య్ పిటిష‌న్‌

tdp leader vijay files a petition in ap highg court on ap cid case
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఐడీ అధికారులు త‌న‌పై న‌మోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్య‌ద‌ర్శి చింత‌కాయ‌ల విజ‌య్ సోమ‌వారం ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు ఆయ‌న కోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణకు స్వీక‌రించిన హైకోర్టు... దీనిపై రేపు (మంగ‌ళ‌వారం) విచార‌ణ చేప‌ట్టే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే ఏపీ సీఐడీ అధికారులు హైద‌రాబాద్‌లోని విజ‌య్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ స‌మ‌యంలో విజ‌య్ దంప‌తులు ఇంటిలో లేక‌పోవ‌డంతో ఆయ‌న కారు డ్రైవ‌ర్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు త‌న ఇంటిలో ర‌భస సృష్టించార‌ని విజ‌య్ ఆరోపించారు. త‌మ ముందు విచార‌ణ‌కు రావాల‌న్న సీఐడీ నోటీసుల‌కు ఆయ‌న రాత‌పూర్వకంగా వివ‌ర‌ణ ఇచ్చారు. తాజాగా,  కేసును కొట్టేయాలంటూ ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు.
Go Back to Shorts
AP CID
TDP
Chintakayal Vijay
AP High Court

More Telugu News