Dharmana Prasad: ఉత్తరాంధ్ర అభివృద్ధి మీకు ఇష్టం లేదా?: అచ్చెన్నాయుడిని సూటిగా ప్రశ్నించిన మంత్రి ధర్మాన

  • మరింత రాజుకున్న మూడు రాజధానుల వ్యవహారం
  • మంత్రి పదవి వచ్చాక ధర్మానకు నోరు పెగిలిందన్న అచ్చెన్న
  • స్పందించిన ధర్మాన
  • శ్రీకాకుళానికి అచ్చెన్నాయుడు ఏంచేశాడంటూ నిలదీత
Dharmana Prasad Rao fires on Atchannaidu

మంత్రి పదవి రాకముందు మౌనంగా ఉన్న ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవి వచ్చాక మూడు రాజధానులు అంటూ మాట్లాడుతున్నాడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించడం తెలిసిందే. దీనిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందించారు. అచ్చెన్నాయుడు శ్రీకాకుళానికి ఏం చేశారని నిలదీశారు. రియల్ ఎస్టేట్ కోసం అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటారా? ఉత్తరాంధ్ర అభివృద్ధి మీకు ఇష్టం లేదా? అంటూ అచ్చెన్నాయుడిని సూటిగా ప్రశ్నించారు. అమరావతిపై నిధులు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రకు మళ్లీ కష్టాలు తప్పవని ధర్మాన స్పష్టం చేశారు. 

More Telugu News