Andhra Pradesh: ఇక ఆర్టీసీ బ‌స్సుల్లోనూ డిజిట‌ల్ పేమెంట్ల‌తో ప్ర‌యాణం

  • బ‌స్సులో టికెట్‌ను యూపీఐ పేమెంట్ ద్వారా కొనుగోలు చేసే అవ‌కాశం
  • తొలుత విశాఖ నుంచి న‌డిచే 97 స‌ర్వీసుల్లో అందుబాటులోకి 
  • ద‌శ‌ల‌వారీగా అన్ని బ‌స్సుల్లో డిజిట‌ల్ చెల్లింపుల విస్త‌ర‌ణ‌
apsrtc will introduce upi payments in buses

ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) స‌త్తా చాటుతోంది. ద‌స‌రాకు అవ‌స‌ర‌మైన‌న్ని ప్ర‌త్యేక బస్సులు ఏర్పాటు చేసిన ఆ సంస్థ‌.. వాటిలో గ‌తంలో మాదిరిగా అద‌న‌పు చార్జీల‌ను వ‌సూలు చేయ‌లేదు. తాజాగా ప్ర‌యాణికుల‌కు మ‌రో సుల‌భ‌త‌ర వెసులుబాటును క‌ల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ‌స్సుల్లో డిజిట‌ల్ చెల్లింపుల‌తో టికెట్ల‌ను విక్ర‌యించేందుకు ఆ సంస్థ తీర్మానించింది. 

బ‌స్సులో టికెట్‌కు చెల్లించాల్సిన సొమ్మును ప్ర‌యాణికులు యూపీఐ పేమెంట్ల ద్వారా చెల్లించేలా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ కొత్త త‌ర‌హా వెసులుబాటును తొలుత విశాఖ నుంచి న‌డిచే 97 స‌ర్వీసుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ద‌ళ‌ల వారీగా అన్ని బ‌స్సుల్లోనూ యూపీఐ చెల్లింపుల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.

More Telugu News