Telangana: తెలంగాణలో తాజాగా 129 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 12,311 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 50 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 141 మంది
  • ఇంకా 844 మందికి చికిత్స
Telangana corona daily stats

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 12,311 శాంపిల్స్ పరీక్షించగా, 129 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 50 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10, ఖమ్మం జిల్లాలో 9, రంగారెడ్డి జిల్లాలో 7 కేసులు వెల్లడయ్యాయి. ఇంకా 385 మంది ఫలితాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో 141 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,36,181 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,31,226 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 844 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది చికిత్స పొందుతున్నారు.

More Telugu News