Secunderabad: సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ బైక్ షోరూం అగ్ని ప్ర‌మాదంపై సీసీటీవీ ఫుటేజీ ఇదిగో

  • తాజాగా సీసీటీవీ ఫుటేజీ విడుద‌ల‌
  • మొత్తం ఎనిమిది మంది మృతి 
  • ఎల‌క్ట్రిక్ బైకుల వ‌ద్దే పేలుడు జ‌రిగిన‌ట్లు దృశ్యాలలో వెల్లడి 

సికింద్రాబాద్ ప‌రిధిలోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో సోమ‌వారం రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం కారణంగా 8 మంది చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నే దానిపై ఇప్ప‌టిదాకా స్ప‌ష్ట‌త రాలేదు. రూబీ హోట‌ల్ సెల్లార్‌లో ఎల‌క్ట్రిక్ బైకుల షోరూంలోనే అగ్ని ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని, అక్క‌డి నుంచి వెలువ‌డ్డ పొగ‌ల‌తో ఊపిరాడ‌క లాడ్జిలోని వారు చ‌నిపోయార‌న్న వాద‌న‌లు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి.

ఈ వాద‌న నిజ‌మేనంటూ తాజాగా విడుద‌లైన రూబీ హోట‌ల్ సీసీటీవీ ఫుటేజీ చెబుతోంది. ఈ వీడియోలో హోట‌ల్ సెల్లార్‌లో ఉన్న ఎల‌క్ట్రిక్ బైకుల వ‌ద్ద తొలుత పేలుడు సంభ‌వించ‌గా... ఆ త‌ర్వాత ప‌లు బైకులు వ‌రుస‌గా పేలిన‌ట్లు సీసీటీవీ ఫుటేజీలో క‌నిపిస్తోంది. అంతేకాకుండా అక్క‌డ జ‌రిగిన పేలుడుతోనే ద‌ట్ట‌మైన పొగ‌లు లాడ్జిని చుట్టుముట్టిన‌ట్లు అందులో క‌నిపిస్తోంది.

More Telugu News