BJP: ఫిల్మ్ సిటీ నుంచి అమిత్ షా, ఇంటి నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్‌... మ‌రికాసేప‌ట్లో నోవాటెల్‌లో భేటీ

  • నిర్దేశిత స‌మ‌యానికి కంటే ఆల‌స్యంగా సాగుతున్న అమిత్ షా టూర్‌
  • ఫ‌లితంగా 2 గంట‌లు ఆల‌స్యంగా ఎన్టీఆర్‌తో భేటీ కానున్న బీజేపీ నేత‌
  • అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల భేటీపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌
jr ntr will meets amit shah shortly

మునుగోడులో బీజేపీ నిర్వ‌హించిన స‌భ‌లో పాల్గొనే నిమిత్తం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆ పార్టీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌రికాసేప‌ట్లో భేటీ కానున్నారు. వాస్త‌వానికి ఆదివారం రాత్రి 8 గంట‌ల‌కే వీరిద్ద‌రూ భేటీ కావాల్సి ఉన్నా... అమిత్ షా టూర్ షెడ్యూల్ నిర్దేశిత స‌మ‌యం కంటే చాలా ఆల‌స్యంగా కొన‌సాగుతోంది. దీంతో వీరి భేటీ రాత్రి 10 గంట‌ల‌కు మొద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి.

మునుగోడు స‌భ ముగించుకుని హైద‌రాబాద్ తిరుగు ప్ర‌యాణ‌మైన అమిత్ షా మార్గ‌మ‌ధ్య‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఆగిన సంగ‌తి తెలిసిందే. ఫిల్మ్ సిటీలో రామోజీ గ్రూపు సంస్థ‌ల అధినేత రామోజీరావుతో భేటీ అయిన అమిత్ షా రాత్రి 9.30 గంట‌ల‌కు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు బ‌య‌లుదేరారు. అదే స‌మ‌యంలో త‌న ఇంటి నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా నోవాటెల్‌కు బ‌య‌లుదేరారు. వీరిద్ద‌రి భేటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

More Telugu News