BJP: రేపే తెలంగాణ టూర్‌కు అమిత్ షా రాక‌... టూర్ షెడ్యూల్ ఇదిగో

  • మ‌ధ్యాహ్నం 3.40 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేర‌నున్న అమిత్ షా
  • మునుగోడులో ద‌ళిత కార్య‌క‌ర్త ఇంటిలో భోజ‌నం
  • రైతుల‌తో మాట్లాడ‌నున్న కేంద్ర హోం మంత్రి
  • రాత్రి 9.30 గంట‌ల‌కు ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణం
this is the tour schedule of amith shah telangana tour tomorrow

న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ రేపు (ఆదివారం) మునుగోడులో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఈ స‌భ‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌మ‌క్షంలో కోమ‌టిరెడ్డి బీజేపీలో చేర‌నున్నారు. ఈ స‌భ కోసం తెలంగాణ రానున్న అమిత్ షా టూర్ షెడ్యూల్ ఈ విధంగా వుంది. 

ఢిల్లీ నుంచి బ‌య‌లుదేర‌నున్న అమిత్ షా రేపు మ‌ద్యాహ్నం 3.40 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్క‌డి నుంచి నేరుగా బ‌య‌లుదేర‌నున్న ఆయ‌న సాయంత్రం 4.30 గంట‌ల‌కు మునుగోడు చేరుకుంటారు. ఆ వెంట‌నే అక్క‌డే సీఆర్పీఎఫ్ అధికారుల‌తో ఆయ‌న భేటీ అవుతారు. అనంత‌రం మునుగోడులో బీజేపీకి చెందిన ఓ దళిత కార్య‌క‌ర్త ఇంటిలో ఆయ‌న భోజ‌నం చేయ‌నున్నారు. 

ఈ తర్వాత అక్క‌డే రైతుల‌తో మాట్లాడ‌నున్న షా... అనంతరం మునుగోడు బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. స‌భ ముగిసిన త‌ర్వాత తిరిగి రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో శంషాబాద్ చేరుకోనున్న అమిత్ షా... ఓ గంటన్న‌ర‌ పాటు నోవాటెల్ హోట‌ల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. అనంత‌రం రాత్రి 9.30 గంట‌ల‌కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయ‌న ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ‌తారు.

More Telugu News