Telangana: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా రోజువారీ కేసులు

  • గత 24 గంటల్లో 33,455 కరోనా పరీక్షలు
  • 528 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 196 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 771 మంది
  • ఇంకా 5,667 మందికి చికిత్స
Telangana corona bulletin

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 33,455 శాంపిల్స్ పరీక్షించగా, 528 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 196 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33, నల్గొండ జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 31 కేసులు గుర్తించారు. అదే సమయంలో 771 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 8,26,284 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,16,506 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,667 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది కరోనాతో మృతి చెందారు.

More Telugu News