తెలంగాణలో ఏపీ స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్య
- కాప్రాలో ఆత్మహత్యకు పాల్పడ్డ గిరిధర్ వర్మ
- గుంటూరు జిల్లా కొరికపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
- రుణ దాతల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వెల్లడి
ఆత్మహత్యకు ముందు గిరిధర్ వర్మ ఓ సూసైడ్ లెటర్ రాసినట్టు తెలుస్తోంది. ఈ లేఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ పలు అంశాలు ప్రస్తావించారు. తాను తీసుకున్న అప్పును చెల్లించినప్పటికీ రుణ దాతలు తనను వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు. రుణ దాతల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు.