SBI: ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ. 10 వేలకు మించి డ్రా చేయాలంటే.. మొబైల్ తప్పనిసరి!

SBIs Rule Change For ATM Cash Withdrawal
షార్ట్స్‌లో చూడండి
స్టేట్‌బ్యాంకు ఏటీఎం నుంచి ఇకపై రూ. 10 వేలకు మించి డ్రా చేయాలంటే మొబైల్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు స్టేట్‌బ్యాంకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారులను కాపాడే లక్ష్యంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఏటీఎం నుంచి రూ. 10 వేలను మామూలుగా తీసుకోవచ్చు.

ఆపై మాత్రం నగదు తీసుకోవాలంటే బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన మొబైల్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు పెట్టి పిన్ నొక్కగానే ఆ మొబైల్‌కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తేనే డబ్బులు డ్రా చేసుకునే వీలుంటుంది. ఈ ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పరిమితం. కాగా, ఇదే నిబంధనను ఇతర బ్యాంకులు కూడా అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Go Back to Shorts
SBI
ATM
Cash Withdrawal
OTP

More Telugu News