Venkaiah Naidu: ఉపరాష్ట్రపతిని కలిసిన ఇళ‌య‌రాజా!

  • రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన ఇళ‌య‌రాజా
  • ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేక‌పోయిన వెంక‌య్య‌
  • ప్రమాణ స్వీకారం తర్వాత ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లిన ఇళయరాజా  
Ilaiyaraaja met venkaiah at Upa Rashtrapati Nivas

ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడుకు తెలుగు నేల అన్నా... ద‌క్షిణాది రాష్ట్రాల సంస్కృతి సంప్ర‌దాయాల‌న్నా ఎన‌లేని అభిమానం. త‌న సొంత జిల్లా నెల్లూరుకు కూత వేటు దూరంలో ఉన్న త‌మిళనాడు, ఆ రాష్ట్ర రాజ‌ధాని చెన్నైతో ఆయ‌న‌ది విడ‌దీయ‌లేని బంధం. త‌మిళ‌నాడుకు సంబంధించి ఏ ముఖ్య కార్య‌క్ర‌మం జ‌రిగినా వెంక‌య్య హాజ‌రు కావాల్సిందే. 

అలాంటిది ఆ రాష్ట్రానికి చెందిన సంగీత ద‌ర్శ‌క దిగ్గజం ఇళ‌య‌రాజా రాజ్య‌సభ స‌భ్యుడిగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేస్తున్న స‌మ‌యంలో రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా ఉన్న వెంక‌య్య అనివార్య కార‌ణాల‌తో హాజ‌రు కాలేక‌పోయారు. ఫ‌లితంగా ఇళ‌య‌రాజాతో రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ ప్ర‌మాణం చేయించారు. 

ఈ క్రమంలో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత ఇళ‌య‌రాజా నేరుగా ఉప‌రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వెళ్లి వెంక‌య్య‌ను క‌లిశారు. త‌న అధికారిక నివాసానికి వ‌చ్చిన ఇళ‌య‌రాజాకు వెంక‌య్య సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు ప్ర‌ముఖులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించుకున్నారు.

More Telugu News