Raviteja: నాకు కొత్తగా అనిపించిన పాత్ర 'రామారావు': రవితేజ

  • శరత్ మండవ నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ'
  • సబ్ కలెక్టర్  గా కనిపించనున్న రవితేజ
  • కథానాయికలుగా దివ్యాన్ష - రజీషా 
  • ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల  
Ramarao On Duty movie update

రవితేజ తాజా చిత్రంగా రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దివ్యాన్ష - రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు.

 తాజా ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ .. " ఈ సినిమాలో నేను సబ్ కలెక్టర్ గా కనిపిస్తాను. ఈ తరహా పాత్రను చేయడం ఇదే ఫస్టు టైమ్. నాకే ఈ పాత్ర చాలా కొత్తగా అనిపించింది. ఈ పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. శరత్ ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆడియన్స్ కి కూడా అదే ఫీల్ కలుగుతుంది. 

ఈ కథ విషయంలో శరత్ చాలా క్లారిటీతో ఉన్నాడు. సోది .. నస .. నాన్చడం నాకు నచ్చదు. తాను చెప్పదలచుకున్న కథ నాకు చాలా క్లియర్ గా చెప్పాడు. అందువలన ఆయన బాగా తీయగలడు అని నేను నమ్మాను. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News