Team India: 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా... కోహ్లీ మరోసారి విఫలం

  • టీమిండియా, ఇంగ్లండ్ మధ్య చివరి వన్డే
  • టీమిండియా టార్గెట్ 260 రన్స్
  • మూడు వికెట్లు తీసి దెబ్బకొట్టిన రీస్ టాప్లే
Kohli fails again

సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేలో టీమిండియా టాపార్డర్ తడబాటుకు గురైంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మూడు వికెట్లు ఇంగ్లండ్ లెఫ్మార్మ్ పేసర్ రీస్ టాప్లే ఖాతాలోకే చేరాయి. తొలుత శిఖర్ ధావన్ (1) అవుట్ కాగా, ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (17) కూడా అదే బాటలో టాప్లేకు వికెట్ అప్పగించాడు. ఫామ్ లో లేక సతమతమవుతున్న కోహ్లీ కాసేపు ప్రతిఘటించినా, ఓ అవుట్ స్వింగర్ కు వికెట్ చేజార్చుకున్నాడు. మరోసారి వికెట్ల వెనుక దొరికిపోయాడు. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 12 ఓవర్లలో 3 వికెట్లకు 52 పరుగులు కాగా, క్రీజులో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 38 ఓవర్లలో 208 పరుగులు చేయాలి.

More Telugu News