TSRTC: మల్లెల తీర్థం జలపాతానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీస్

  • అచ్చంపేట నుంచి ప్రతి రోజూ రెండు సర్వీసులు
  • ఉదయం, సాయంత్రం వేళ్లలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ
  • హైదరాబాద్ నుంచి దూరం 173 కిలోమీటర్లు
TSRTC arranges bus service to Mallela Theertham waterfall

తెలంగాణ ఆర్టీసీ శ్రీశైలంలోని మల్లెల తీర్థానికి రోజువారీ ప్రత్యేక బస్సు సర్వీస్ ను ఆరంభించింది. ప్రతి రోజూ ఈ బస్సు సర్వీసు మల్లెల తీర్థం జలపాతానికి పర్యాటకులను తీసుకెళ్లనుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి ఈ సర్వీసు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు బయల్దేరుతుంది. అక్కడి నుంచి మళ్లీ 8.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.

అలాగే, ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు మరో సర్వీసు ఉంటుంది. ఇది కూడా సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరుతుంది. హైదరాబాద్ నుంచి మల్లెల తీర్థం 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. అచ్చంపేట నుంచే 55 కిలోమీటర్లు ఉండడం గమనార్హం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ జలపాతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. దీంతో వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసు ఏర్పాటు చేసింది.

More Telugu News