Andhra Pradesh: మ‌రో రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్ర‌భుత్వం

  • 7.95 శాతం వ‌డ్డీకి తాజా రుణం
  • కేంద్రం అనుమ‌తించిన రుణ ప‌రిమితిలోనే కొత్త అప్పు
  • రిజ‌ర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ వేలం ద్వారా రుణ సేక‌ర‌ణ‌
ap government takes new loan of 3000 crores

ఏపీ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం మ‌రో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకుంది. ప్ర‌తి మంగ‌ళ‌వారం రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో సెక్యూరిటీ బాండ్ల వేలం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం నాటి సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న ఏపీ ప్ర‌భుత్వం రూ.3 వేల కోట్ల‌ను రుణంగా తీసుకుంది. 

ఈ కొత్త రుణాన్ని ఏపీ ప్ర‌భుత్వం 7.95 శాతం వ‌డ్డీకి సేక‌రించింది. ఈ రుణాన్ని కేంద్రం అనుమ‌తించిన రుణ ప‌రిమితి నుంచే రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించింది. ఇదిలా ఉంటే... గ‌త మంగ‌ళ‌వారం కూడా రిజ‌ర్వ్ బ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.2 వేల కోట్ల రుణాన్ని సేక‌రించింది.

More Telugu News