Infosys: విశాఖలో భారీ క్యాంప‌స్‌పై ఇన్ఫోసిస్ ప్ర‌క‌టన ఇదిగో!

this is the infosys statement on its vizag campus
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని విశాఖ కేంద్రంగా భారీ క్యాంప‌స్ ఏర్పాటుకు దేశీయ ఐటీ దిగ్గ‌జం ఇన్ఫోసిస్ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంపై ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ క్యాంప‌స్‌లో తొలి ద‌శ‌లో 1,000 సీటింగ్ కెపాసిటీ ఉండేలా ఇన్పోసిస్ ప్లాన్ చేస్తోంద‌ని, ద‌శ‌ల‌వారీగా దానిని 3 వేల సీటింగ్ కెపాసిటీకి పెంచ‌నుంద‌ని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

తాజాగా విశాఖ‌లో భారీ క్యాంప‌స్ ఏర్పాటుకు సంబంధించి ఇన్ఫోసిస్ కూడా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. విశాఖతో పాటు నాగపూర్‌, కోల్‌క‌తా, ఇండోర్‌, కోయంబ‌త్తూర్‌, నోయిడాల్లోనూ కొత్త‌గా త‌న క్యాంప‌స్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా ఆ సంస్థ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.
Go Back to Shorts
Infosys
Vizag
Andhra Pradesh

More Telugu News