సికింద్రాబాద్ కాల్పుల ఘటనపై మావోయిస్టుల స్పందన ఇదే
- తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ పేరిట మావోయిస్టుల లేఖ
- అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్
- పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలన్న మావోయిస్టులు
- ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్
అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని కూడా మావోయిస్టులు ఆ లేఖలో డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేశ్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, బాధితుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా కాల్పులు జరిపిన పోలీసులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.