Puli-Meka: లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్ 'పులి-మేక'... జీ5, కోన ఫిలిం కార్పొరేషన్ భాగస్వామ్యంలో కొత్త వెబ్ సిరీస్‌

  • నేడు హైదరాబాద్ లో ప్రారంభం
  • క్లాప్ కొట్టిన దర్శకుడు బాబీ
  • కెమెరా స్విచాన్ చేసిన అనిల్ రావిపూడి
  • 'పంతం' ఫేమ్ చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో పులి-మేక
Puli Meka web series starts

లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ వంటి అగ్రనటులతో క్రైమ్ థ్రిల్లర్‌ 'పులి - మేక' వెబ్ సిరీస్ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5, సినీ రచయిత కోన వెంకట్ కు చెందిన కోన ఫిలిం కార్పోరేషన్ ఈ వెబ్ సిరీస్ ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్ తదితర టాలీవుడ్ స్టార్లు ఉండడంతో దీనిపై అత్యంత ఆసక్తి కలుగుతోంది. గోపీచంద్ హీరోగా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె.చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు.

క్రైమ్ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్న 'పులి - మేక’ వెబ్ సిరీస్ పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ విచ్చేశారు. దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు.
.

More Telugu News